PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiabbe8b604-3c54-4ea8-a0cc-e38ee8170c51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiabbe8b604-3c54-4ea8-a0cc-e38ee8170c51-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కోవిడ్ టీకా వచ్చిన వెంటనే పంపిణి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. టీకా కోసం జనాలు ఎగబడకుండా పక్కాగా ప్రణాళికలు వేస్తోంది.india;health;koti;district;police;january;parliment;assembly;army;central governmentప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే ఇండియాలోప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే ఇండియాలోindia;health;koti;district;police;january;parliment;assembly;army;central governmentMon, 14 Dec 2020 09:26:12 GMTకేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. టీకా కోసం జనాలు ఎగబడకుండా పక్కాగా ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం తయారు చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్రం గైడ్ లెన్స్ ప్రకారం రాష్ట్రాలు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో సోమ, మంగళవారాల్లో జిల్లా స్థాయి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తర్వాత మండల స్థాయి వైద్య సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తారు. రెండు రోజుల ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.


 తొలిరోజు శిక్షణలో వ్యాక్సినేషన్‌ ప్రణాళికలు, టీకా కోల్డ్‌ చైన్‌ నిల్వ, టీకా ఇవ్వాల్సిన విధానం, వ్యర్థాల నిర్వహణ, కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌.. దాని పనితీరుపై అవగాహన కల్పిస్తారు. రెండోరోజు టీకా తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? సైడ్‌ ఎఫెక్టులు ఏమైనా వచ్చాయా? తదితర అంశాలతో పాటు పర్యవేక్షణ, టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భయాందోళనలు తొలగించడం, తగిన ప్రచారం కల్పించడం వంటి అంశాలపై శిక్షణనిస్తారు.దేశవ్యాప్తంగా పోలింగ్ సెంటర్ల తరహాలోనే వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

             
  తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బందికి, మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. వీరు దేశవ్యాప్తంగా27 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.





టెట్ లేకుండా డీఎస్సీ ఎలా? కేసీఆర్ ప్రకటనపై గందరగోళం

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>