PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp1ef058aa-d9fc-4929-8636-b1cee02ff85b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-bjp1ef058aa-d9fc-4929-8636-b1cee02ff85b-415x250-IndiaHerald.jpgమోడీ ని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవసాయ బిల్లుల ను అడ్డుపెట్టుకుని రైతుల ను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ద్వారా రైతుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్న ఆయన ఈ ఉద్యమం పంజాబ్ వరకే పరిమితం అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రైతులను కలుస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఖండించారు. మోదీ, అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడరో ఆయన్tollywood;modi;amit shah;soniagandhi;kcr;amala akkineni;prema;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;narendra modi;g kishan reddy;congress;reliance;electricity;love;job;minister;central government;punjab;reddy;partyటీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి !టీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి !tollywood;modi;amit shah;soniagandhi;kcr;amala akkineni;prema;vidya;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;narendra modi;g kishan reddy;congress;reliance;electricity;love;job;minister;central government;punjab;reddy;partyMon, 14 Dec 2020 15:00:00 GMTమోడీ ని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవసాయ బిల్లుల ను అడ్డుపెట్టుకుని రైతుల ను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ద్వారా రైతుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్న ఆయన ఈ ఉద్యమం పంజాబ్ వరకే పరిమితం అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రైతులను కలుస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఖండించారు. మోదీ, అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడరో ఆయన్నే అడగండి అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్, భారత్ బంద్ లో పాల్గొన్న కేసీఅర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

 కలలో కూడా రైతు వ్యతిరేక నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకోదన్న కిషన్ రెడ్డి, రైతు అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుందని అన్నారు. ఏ రాష్ట్రం లో కూడా వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు లేవు, కిసాన్ బ్రాండ్ పేరుతో ఒకటి రెండు నెలల్లో రామగుండం నుండి తెలుగు రాష్ట్రాల కు యూరియా ఇస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా లక్షా 15 వేల 578 కోట్ల రుణాలు రైతులకు ఇవ్వడం జరిగిందని, పంటల బీమా పథకం దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు.  వ్యవసాయం చేస్తే పిల్లను కూడా ఇవ్వడం లేదు.. ఇలాంటి పరిస్థితి పోవాలి.. రైతు ఆదాయం పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇప్పటి వరకు కేంద్రం చేసింది చాలా తక్కువ ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్న ఆయన రైతులంటే బీజేపీకి ఎనలేని ప్రేమ.. మాకు ఎవరి రికమండేషన్స్ అవసరం లేదు అని అయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద ఎప్పుడు నిలబడదన్నఆయన మొన్నటి బంద్ రైతుల బంద్ కాదు రాజకీయ పార్టీ ల బంద్ అని ఎద్దేవా చేశారు. ఇతర దేశాల నుండి పళ్ళు,పూలు మన దేశానికి ఎందుకు రావాలి ? రిలయన్స్ ఫ్రెష్ లు, ఆదాని లు ఎవరి ప్రభుత్వం లో వచ్చారు.. సోనియా ఉన్నప్పుడే వాళ్లు వ్యవసాయ రంగంలోకి ఎంటర్ అయ్యారు అని అయన అన్నారు. పంజాబ్ లో మండి లాబీ ఉద్యమం చేస్తోంది.. అయినా వారిని గౌరవించాం చట్టాల్లో మార్పులు చెయ్యడానికి సిద్ధం అని చెప్పినా సరే ఉద్యమం చేస్తున్న వారు వితండవాదం చేస్తున్నారని అన్నారు. 


అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>