PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-tdp-situation-in-visakhapatnam-so-bad72b5a9d0-d701-4da4-8616-43e7f53c6bcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-tdp-situation-in-visakhapatnam-so-bad72b5a9d0-d701-4da4-8616-43e7f53c6bcf-415x250-IndiaHerald.jpgజగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఎందుకో విశాఖ పై పట్టు సాధించేలేకపోయారు..నగరం నడిబొడ్డున ప్రజలు టీడీపీ కే పట్టం కట్టారు. నాలుగు స్థానాలకు గాను నాలుగు స్థానాలు టీడీపీ నే గెలిపించారు.. దాంతో ఇక్కడి టీడీపీ స్థావరాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నారు జగన్.. అదే సమయంలో రాజధాని మార్పు వైసీపీ కి అనుకూలించింది.. టీడీపీ కూడా విశాఖ కి రాజధాని ని తరలించిపోవడంతో విశాఖ ప్రజలందరూ టీడీపీ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. janasena;view;tiru;jagan;2019;vishakapatnam;capital;mla;cycle;letter;tdp;ycp;party;velagapudiవిశాఖ లో టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..?విశాఖ లో టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..?janasena;view;tiru;jagan;2019;vishakapatnam;capital;mla;cycle;letter;tdp;ycp;party;velagapudiFri, 11 Dec 2020 15:30:28 GMTజగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఎందుకో విశాఖ పై పట్టు సాధించేలేకపోయారు..నగరం నడిబొడ్డున ప్రజలు టీడీపీ కే పట్టం కట్టారు. నాలుగు స్థానాలకు గాను నాలుగు స్థానాలు టీడీపీ నే గెలిపించారు.. దాంతో ఇక్కడి టీడీపీ స్థావరాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నారు జగన్.. అదే సమయంలో రాజధాని మార్పు వైసీపీ కి అనుకూలించింది.. టీడీపీ కూడా విశాఖ కి రాజధాని ని తరలించిపోవడంతో విశాఖ ప్రజలందరూ టీడీపీ ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు.

టీడీపీ అమరావతిలోని రాజధాని ఉండాలని అనడంతో విశాఖ ప్రజలందరూ వైసీపీ పక్షాన చేరి విశాఖ టీడీపీ నాయకులను ఒత్తిడి చేశారు. ఆ వత్తిడి కి తతుకోలేక ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు అధికారికంగా కాకపోయినా వైసీపీ లో చేరినట్లే కనిపిస్తుంది.. వారి కుటుంబ సభ్యులని వైసీపీ లో చేర్చుకుని ప్రజాగ్రహానికి లోను కాకుండా ఉన్నారు. టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తప్ప మిగిలిన ముగ్గురు దాదాపుగా దూరమయినట్టేనని స్పష్టంగా తెలుస్తుంది..

దీంతో దాదాపు ఇక్కడ సైకిల్ పని అయిపోయిందన్నట్లుగానే భావిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ ని అస్సలు కోలుకోనీయొద్దని కొత్త కొత్త వ్యూహాలు రచిస్తోంది వైసీపీ .. పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల నేత విజయసాయిరెడ్డి స్వయంగా విశాఖ రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.  త్వరలో ఇక్కడ గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం దాదాపు ఖాయమని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ సర్కారు చేపడుతోంది. స్మార్ట్ సిటీగా ఉన్న విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు మెట్రో సహా పలు మార్పులు చేపడుతోంది. ప్రభుత్వం ద్వారా అభివృద్ది, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి క్యాడర్ ని సన్నద్ధం చేసే ప్రయత్నం ఏకకాలంలో సాగుతున్న తరుణంలో విశాఖలో ఆపార్టీకి దాదాపు తిరుగులేదనే అభిప్రాయం సామాన్యుల్లో కూడా వ్యక్తమవుతోంది.


కొడాలి నానీకి నేనెవరో తెలియదా...? ఈ రోజు నుంచే చూపిస్తా...!

ఆ రైతు అకౌంట్లో 4వేలకు బదులు 473కోట్లు... తీరా విత్ డ్రా సమయంలో ?

జనవరి 25 కు మహేష్ సర్కారు వారి పాట..!!

ఆక్వారంగానికి మంచి రోజులు !

అమరావతి ఉద్యమం మరింత ఉధృతం

వైసీపీ ని టెన్షన్ పెడుతున్న చోటా నేతలు..వీరితోనే ముప్పు..?

ప్రత్యేక రాయలసీమ కావాల్సిందే, టీడీపీ మాజీ హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>