PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెరాస పార్టీని ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు తెరాస పార్టీని వెంటాడే అవకాశం ఉంది అని అంటున్నారు. మంత్రులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్ రావు, కేటిఅర్ ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇక తాజాగా బిజెపి హరీష్ టార్గెట్ గా విమర్శలు చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావharish rao;raghu;swetha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;district;media;mla;minister;letter;central government;siddipet;party;mantraహరీష్ ని టార్గెట్ చేసిన బిజెపి, త్వరలో పత్రం విడుదల అవుతుందా...?హరీష్ ని టార్గెట్ చేసిన బిజెపి, త్వరలో పత్రం విడుదల అవుతుందా...?harish rao;raghu;swetha;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;district;media;mla;minister;letter;central government;siddipet;party;mantraTue, 08 Dec 2020 20:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెరాస పార్టీని ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు తెరాస పార్టీని  వెంటాడే అవకాశం ఉంది అని అంటున్నారు. మంత్రులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్ రావు, కేటిఅర్  ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇక తాజాగా బిజెపి హరీష్ టార్గెట్ గా విమర్శలు చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిద్దిపేటలో చాలా కాలంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తే కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది అని ఆయన ఆరోపించారు. త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగానే ఇండ్ల పంపిణీ చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటి రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది అని ఆయన అన్నారు. అనేక సాప్ట్ వేర్ కంపెనీలు చతికిల పడ్డాయి అని ఆయన విమర్శించారు. ఐటీ కోసం శంకుస్థాపన చేయడం ఇప్పుడు సరైన సమయం కాదు, బీజేపి అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని వ్యాఖ్యలు చేసారు.

సిద్దిపేట మున్సిపాలిటీకి కేంద్రం ఇచ్చిన నిధులపై మున్సిపల్ ఎన్నికల కంటే ముందే మంత్రి హరీష్ రావు శ్వేత పత్రం విడుదల చేయాలి, లేదంటే బీజేపి తరపున మేము విడుదల చేస్తాం అని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పనుల్లో నాణ్యత లేదు అని... పారదర్శకత లేదు అన్నారు. అవినీతి పెరిగింది అని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>