PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-former7cfc19af-a430-449e-9514-882da3081dd6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-former7cfc19af-a430-449e-9514-882da3081dd6-415x250-IndiaHerald.jpgదేశంలో రైతు ఇపుడు రోడ్డున పడ్డాడు. చలి కాలాన్ని సైతం మండించేలా వేడిని పుట్టిస్తున్నాడు. ఢిల్లీలో వణుకు పుడుతోంది. కానీ అది చలి దెబ్బతో కాదు, ఆరుగాలం పండించే రైతు ఆగ్రహ జ్వాలతో. మరి రైతన్నకు వ్యతిరేకంగా మూడు కొత్త వ్యవసాయ బిల్లులను కేంద్రం గత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించింది. దాంతో రైతులంతా వీధుల్లోకి వచ్చారు. ap former;kcr;hari;hari music;kerala;delhi;telugu desam party;india;jagan;haryana - chandigarh;congress;telugu;parliment;job;tamilnadu;tdp;central government;punjab;partyఆంధ్రా రైతులు ఫుల్ హ్యాపీస్.. అందుకేనా అలా ?ఆంధ్రా రైతులు ఫుల్ హ్యాపీస్.. అందుకేనా అలా ?ap former;kcr;hari;hari music;kerala;delhi;telugu desam party;india;jagan;haryana - chandigarh;congress;telugu;parliment;job;tamilnadu;tdp;central government;punjab;partyMon, 07 Dec 2020 19:00:00 GMTపార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించింది. దాంతో రైతులంతా వీధుల్లోకి వచ్చారు.

ఈ బిల్లులను ఉపసంహరించుకోవాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి వ్యవసాయ‌ధారిత ప్రాంతాలుగా పేరుపడిన హర్యానా పంజాబ్ వంటి చోట్ల అయితే రైతు అగ్గి పుట్టిస్తున్నాడు. కేంద్రం మెడలు వంచైనా సరే కొత్త బిల్లులను రద్దు చేయించుకోవాలనుకుంటున్నాదు. దాని కోసం సామదాన భేద దండోపాయాలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది. యుద్ధమేనంటూ సిద్ధపడుతున్నాడు.

దాంతో ఈ నెల 8న భారత్ బంద్ కి పిలుపు ఇచ్చాడు రైతన్న దానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలంగాణా సీఎం కేసీయార్ అయితే రైతుల పక్షాన నిలిచి ఢిల్లీ పై పోరుకు సై అంటున్నారు. కేరళ నుంచి మద్దతు లభిస్తోంది. తమిళనాడులోనూ అక్కడి పార్టీలు రైతన్నకు మద్దతు ఇస్తున్నారు. మరి ఆంధ్రాలో పరిస్థితి ఏంటి అంటే ఇక్కడే ఉంది తమాషా అంటున్నారు.

ఆంధ్రా రైతులు ఈ భారత్ బంద్ కి మద్దతు ఇస్తున్నారా లేదా అన్నది తేలడంలేదు. అదే సమయంలో ఇక్కడి రాజకీయ పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ రైతులకు మద్దతుగా నిలిచినా ఆ గొంతు ఎక్కడా మీడియాలో వినిపించడంలేదు. ఇక అధీకార వైసీపీని తీసుకుంటే జగన్ దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడంలేదు. విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అలాగే ఉంది. రైతుల పక్షాన నిలిస్తే ఎక్కడ మోడీకి దూరం అవుతామో అన్న బెంగ టీడీపీ నాయకత్వానికి ఉన్నట్లుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే మూడు వ్యవసాయ బిల్లుల మీద ఆంధ్రా రైతులు ఫుల్ హ్యాపీస్ అన్న మాట. లేకపోతే రాజకీయ పార్టీలు ఎందుకు గమ్మున ఉంటాయి అన్న ప్రశ్న కూడా వస్తోంది.




రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?

శీతాకాలంలో ఈ సూప్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>