PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/prakash-singh-badal85c91715-dc6c-400d-be13-e360555b97e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/prakash-singh-badal85c91715-dc6c-400d-be13-e360555b97e7-415x250-IndiaHerald.jpgగతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇవ్వడం అనేది సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి అది ట్రెండింగ్ గా మారింది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ దిశగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (92) మొదటి అడుగు వేశారు. ప్రభుత్వం నుంచి గతంలో తీసుకున్న పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. అన్నదాతలకు మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తిగా నిలిచారుprakash singh badal;narendra singh tomar;narendra singh tomar.;రాజీనామా;chief minister;december;job;minister;central government;punjab;piyush chawla;party;mantra;narendraరైతుల కోసం 'పద్మ విభూషణ్' అవార్డు వెనక్కి ఇచ్చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి!రైతుల కోసం 'పద్మ విభూషణ్' అవార్డు వెనక్కి ఇచ్చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి!prakash singh badal;narendra singh tomar;narendra singh tomar.;రాజీనామా;chief minister;december;job;minister;central government;punjab;piyush chawla;party;mantra;narendraFri, 04 Dec 2020 05:00:00 GMTకేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇవ్వడం అనేది సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి అది ట్రెండింగ్ గా మారింది. రైతులకు మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ దిశగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (92) మొదటి అడుగు వేశారు. ప్రభుత్వం నుంచి గతంలో తీసుకున్న పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. అన్నదాతలకు మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. జై కిసాన్ నినాదం మార్మోగుతోంది. రైతులకు మద్దతు పలుకుతూ పంజాబ్‌కు చెందిన పలువురు క్రీడా ప్రముఖులు కూడా తమ పురస్కారాలు వెనక్కి ఇచ్చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. శనివారం (డిసెంబర్ 5) ఢిల్లీకి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు.


ఇక.. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు 2015లో బహూకరించింది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి ఆకాలీదళ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఆ పార్టీ నేత హర్‌సిమ్రన్ కౌర్ బాదల్.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం రైతుల పోరాటానికి మరింత బలం ఇచ్చింది. గతంలో మాజీ సైనికుల పోరాటం సందర్భంగా ‘అవార్డులను వెనక్కి ఇచ్చే అంశం’ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత తాజాగా రైతుల పోరాటం సందర్భంగా ఇది మరోసారి కీలక అస్త్రంగా మారింది. రైతులతో కేంద్ర మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. రైతు సంఘాల ప్రతినిధులతో రెండో రోజైన గురువారం చర్చలు జరుపుతున్నారు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దూసుకెళుతున్న ఎమ్మెల్యే... అక్కడ మళ్ళీ వైసీపీనే...

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>